Bride: పాపం.. ఆ వరుడు.. పెళ్లి మండపంలో వధువు నిర్వాకానికి ఆ పెళ్లికొడుకు పరువు పోయిందిగా.. పెళ్లిచూపుల్లో సరిగ్గా చూడలేదంటూ..!

ABN , First Publish Date - 2023-06-08T17:34:22+05:30 IST

వివాహ కార్యక్రమంలో కొన్నిసార్లు వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు వధూవరులు.. ముహూర్థ సమయంలో దగ్గరపడ్డాక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అప్పటిదాకా సంతోషంగా ఉంటూ ఒక్కసారిగా అందరికీ సడన్ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు..

Bride: పాపం.. ఆ వరుడు.. పెళ్లి మండపంలో వధువు నిర్వాకానికి ఆ పెళ్లికొడుకు పరువు పోయిందిగా.. పెళ్లిచూపుల్లో సరిగ్గా చూడలేదంటూ..!
ప్రతీకాత్మక చిత్రం

వివాహ కార్యక్రమంలో కొన్నిసార్లు వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు వధూవరులు.. ముహూర్థ సమయంలో దగ్గరపడ్డాక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. అప్పటిదాకా సంతోషంగా ఉంటూ ఒక్కసారిగా అందరికీ సడన్ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లిమండపంలో వధువు నిర్వాకానికి వరుడి పరువు పోయినంతం పనైంది. పెళ్లి చూపుల్లో సరిగ్గా చూడలేదంటూ ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కౌశాంబి జిల్లా పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పూర్ ప్రాంతానికి చెందిన యువకుడికి.. స్థానిక ప్రాంతానికి చెందిన యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. మే 29న ముహూర్థం పిక్స్ చేశారు. పెళ్లి రోజు వరుడు (groom) తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వధువు (bride) గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లి మండపంలో వరమాల కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. వరుడు పెళ్లి దుస్తుల్లో ముస్తాబై వేదిక పైకి చేరుకున్నాడు. కాసేపటికి వధువు కూడా వేదిక పైకి చేరుకుంది. అనంతరం వధువు మెడలో దండ వేసేందుకు వరుడు ప్రయత్నిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: బైక్‌పై వెళ్తూ ఇదేం పనయ్యా బాబూ.. మీలాంటి వాళ్ల వల్లే కదా.. అమాయక జనాల ప్రాణాలు పోతున్నాయ్..!

దండ వేస్తుండగా వరుడిని చూసిన వధువు ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ‘‘వరుడు నల్లగా ఉండడంతో పాటూ వయసులో నా కంటే చాల పెద్దావాడు.. పెళ్లి చూపుల్లో సరిగ్గా చూడలేదు.. నాకీ పెళ్లి వద్దు’’.. అంటూ (bride canceled the wedding) భీష్మించుకుంది. వధువు ప్రవర్తనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బంధువులంతా కలుగజేసుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మాత్రం వినిపించుకోలేదు. చివరకు గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా వధువు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో చేసేదేమీ లేక చివరకు వరుడు నిరాశతో తన గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Odisha Train Accident: ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సీన్ ఇదీ.. ఓ పారిశుధ్య కార్మికుడు రైలును ఊడుస్తోంటే..!

Updated Date - 2023-06-08T17:34:22+05:30 IST