రైల్లోంచి ప్రయాణీకులంతా దిగినా ఎవరూ తీసుకెళ్లని ట్రంకు పెట్టె.. కిందకు దించి తాళాలు పగలగొడితే లోపల కనిపించిన దృశ్యం చూసి..!

ABN , First Publish Date - 2023-02-15T15:29:45+05:30 IST

అది ఓ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్. ప్రయాణికులతో గమ్యస్థానం చేరుకుంది. దీంతో అంతా ఎవరి లగేజీ వారు తీసుకుని దిగిపోతున్నారు. కానీ ఓ పెద్ద ట్రంకు పెట్టెను మాత్రం ఎవరో మర్చిపోయారు. అయితే దాన్ని తీసుకెళ్లేందుకు మాత్రం ఎవరూ రాలేదు. చివరకు..

రైల్లోంచి ప్రయాణీకులంతా దిగినా ఎవరూ తీసుకెళ్లని ట్రంకు పెట్టె.. కిందకు దించి తాళాలు పగలగొడితే లోపల కనిపించిన దృశ్యం చూసి..!

అది ఓ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్. ప్రయాణికులతో గమ్యస్థానం చేరుకుంది. దీంతో అంతా ఎవరి లగేజీ వారు తీసుకుని దిగిపోతున్నారు. కానీ ఓ పెద్ద ట్రంకు పెట్టెను మాత్రం ఎవరో మర్చిపోయారు. అయితే దాన్ని తీసుకెళ్లేందుకు మాత్రం ఎవరూ రాలేదు. చివరకు రైలు మొత్తం ఖాళీ అయినా.. పెట్టె అలాగే ఉంది. గమనించిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి ఓపెన్ చేశారు. చివరకు లోపల ఉన్న కనిపించిన దృశ్యం అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) పాట్నా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ధన్‌బాద్-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (Intercity Express) రైలు సోమవారం అర్ధరాత్రి పాట్నా రైల్వే జంక్షన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆగింది. ప్రయాణికులంతా ఎవరి సామాన్లు వారు తీసుకుని హడావుడిగా దిగిపోతున్నారు. అయితే అంతా వెళ్లిపోయినా బోగీలో ఓ పెద్ద ట్రంకు పెట్టె (iron box) మాత్రం అలాగే ఉంది. అక్కడే ఉన్న కొందరు గమనించినా.. ఎవరైనా మర్చిపోయారేమో.. మళ్లీ వచ్చి తీసుకుపోతారేమో అనుకుని పట్టించుకోలేదు. కానీ దాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు. రైలు మొత్తం ఖాళీ అయినా ఆ పెట్టె మాత్రం అలాగే ఉంది. చివరికి రైల్వే సిబ్బంది (Railway staff) గమనించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కొద్ది సేపటికి అధికారులు.. పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అందరి సమక్షంలో పెట్టెకు ఉన్న తాళాన్ని బద్దలు కొట్టి ఓపెన్ చేశారు.

సులభ్ కాంప్లెక్స్‌లో తుపాకీని మర్చిపోయి వెళ్లిపోయిన పోలీసు.. 15 నిమిషాల తర్వాత గుర్తుకొచ్చి తిరిగొచ్చి చూస్తే..

crime-news.jpg

చివరకు లోపల ఓ యువకుడి (young man dead body) మృతదేహం ఉండడం చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుమారు 292 కిలోమీటర్లు పెట్టె బోగీలో ఉన్నా ఎవరికీ అనుమానం రాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో యువకుడిని హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పెట్టెలో ఉంచి.. ధన్‌బాగ్ ప్రాంతంలో బోగీలో పడేసి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని, సుమారు ఐదు అడుగుల ఎత్తు, ఛామనచాయ రంగు, నల్ల జీన్స్ ప్యాంటు, నీలం చారల చొక్కా ధరించాడని తెలిపారు. అతడి ఫొటో అన్ని స్టేషన్లకు పంపించామని, ఎవరైనా గుర్తుపడితే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. పెట్టెలో మృతదేహం బయటపడిన వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

నీతో కాపురం చేయను.. పిల్లల్ని కూడా కనను.. పెళ్లయిన మర్నాడే భార్య మాటలు విని అవాక్కైన భర్త.. అసలు కథేంటంటే..

Updated Date - 2023-02-15T15:35:00+05:30 IST