IND vs PAK: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టు ఇదే!

ABN , First Publish Date - 2023-09-02T14:47:39+05:30 IST

తుది జట్లు భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

IND vs PAK: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టు ఇదే!

క్యాండీ: ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ వేయగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్సే పడింది. దీంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు. నేపాల్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ఈ పిచ్‌పై 2020 నుంచి 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలిచింది. కాగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 13సార్లు (వన్డే ఫార్మాల్లో) తలపడ్డాయి. భారత్‌ 7, పాక్‌ 5 మ్యాచుల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

Updated Date - 2023-09-02T14:51:37+05:30 IST