Share News

Fit Rise-75: 5K రన్‌ను ప్రారంభించిన అమిత్‌ షా

ABN , First Publish Date - 2023-10-27T11:11:34+05:30 IST

ఫిట్ రైజ్-75 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 5కే రన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం ఉదయం ప్రారంభించారు.

Fit Rise-75: 5K రన్‌ను ప్రారంభించిన అమిత్‌ షా

హైదరాబాద్: ఫిట్ రైజ్-75 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 5కే రన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Union Minister Amit Shah) శుక్రవారం ఉదయం ప్రారంభించారు. 5కే రన్‌లో 74 బ్యాచ్ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ఫిట్‌నెస్‌పై ప్రతీ ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. ఫిట్ ఇండియా ప్రోగ్రాం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. యోగా, ధ్యానం, ఎక్సర్ సైజ్‌ల ద్వారా శరీరంతో పాటు మనస్సు ఫిట్‌గా ఉంటుందన్నారు. ప్రతీ ఒకరి జీవితంలో ఫిట్‌నెస్ భాగమవ్వాలన్నారు. డే లాంగ్ వర్క్ చేయాలంటే ఫిజికల్‌గా ఫిట్ ఉండాలని అమిత్‌ షా వెల్లడించారు.

Updated Date - 2023-10-27T11:11:34+05:30 IST