Bandi Sanjay: స్వామినాథన్ మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు

ABN , First Publish Date - 2023-09-28T17:30:33+05:30 IST

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) మృతి బాధాకరం. ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: స్వామినాథన్ మృతి వ్యవసాయ రంగానికి తీరని లోటు

హైదరాబాద్: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) మృతి బాధాకరం. ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు. గురువారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘వ్యవసాయంలో రైతు పెట్టే పెట్టుబడికి వ్యయం తగ్గేలా చేశారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర(MSP) ను నిర్ణయించాలని సిఫారసు కోసం పోరాటం చేశారు. నిరంతరం రైతు సంక్షేమానికి పాటుపడ్డారు. స్వామినాథన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని వేడుకుంటున్నా’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-28T17:30:33+05:30 IST