Share News

Raghunandanrao: కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయ్..

ABN , Publish Date - Dec 19 , 2023 | 01:52 PM

Telangana: కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని.. మార్చ్ 2023లోనే కాగ్ లేఖ పంపిందని బీజేపీ నేత రఘునందనరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు.

Raghunandanrao: కాళేశ్వరంపై కాంగ్రెస్ తీరు పట్ల అనుమానాలున్నాయ్..

హైదరాబాద్: కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని.. మార్చ్ 2023లోనే కాగ్ లేఖ పంపిందని బీజేపీ నేత రఘునందనరావు (BJP Leader Raghunandan rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ బండారం ఎక్కడ బయట పడుతుందో అని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తమకు అనుమానాలున్నాయన్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిందన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని.. ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని.. అది ప్రాజెక్ట్‌లో చిన్న భాగమే అని అన్నారు. కాళేశ్వరం పక్కన పెట్టేసి మెడిగడ్డ వరకే చర్చ సాగుతోందన్నారు.


ప్రాజెక్ట్ కృంగినప్పుడు మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన రాహూల్ గాంధీ కాళేశ్వరం సొమ్మును రికవరీ చేసి .. ప్రజల ఖాతాలో వేస్తామని చెప్పిన మాటేమిటని ప్రశ్నించారు. స్కాం వెనకాల మేఘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందని ఆరోపించారు. ఎల్ అండ్ టీ వరకే కాళేశ్వరం స్కాం పరిమితం చేయాలని చూస్తున్నారన్నారు. మేఘ కంపెనీకి కర్ణాటకలో కొన్ని ప్రాజెక్ట్స్ దక్కాయన్నారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధిని మేఘా పెద్దలు కలిసినట్టు సమాచారం ఉందన్నారు. దీంతో మేఘ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్ట్ జడ్జి విచారణ అనేది కేసును పక్క దారి పాటించడానికి మాత్రమే అని.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మేఘ కరప్షన్ మీద సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ కేంద్రాన్ని కోరాలన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే తాను ఇస్తాను అని బీజేపీ నేత రఘునందనరావు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 19 , 2023 | 01:52 PM