BJP Laxman: ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు

ABN , First Publish Date - 2023-09-04T14:37:17+05:30 IST

సనాతన ధర్మం నిర్మూలించాలని హిందువులను అవమాన పరిచారు. కొన్ని పార్టీలు, నేతలు 100 కోట్ల హిందువులను అవమానించారు. ఉధయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు పట్టలేదు. కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలి. గజినీ నుంచి ఔరంగ జేబులు, షాజహాన్, నిజాం, రజాకార్లు, మజ్లీస్‌లు ఎవరు దాడి చేసినా గుడులు, గోపురాలు, హత్యలు చేసినా ధర్మం పెరుగుతూనే ఉన్నది.’’

BJP Laxman: ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు

హైదరాబాద్: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సనాతన ధర్మం నిర్మూలించాలని హిందువులను అవమాన పరిచారు. కొన్ని పార్టీలు, నేతలు 100 కోట్ల హిందువులను అవమానించారు. ఉధయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు తప్పు పట్టలేదు. కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలి. గజినీ నుంచి ఔరంగ జేబులు, షాజహాన్, నిజాం, రజాకార్లు, మజ్లీస్‌లు ఎవరు దాడి చేసినా గుడులు, గోపురాలు, హత్యలు చేసినా ధర్మం పెరుగుతూనే ఉన్నది.’’ అని లక్ష్మణ్ తెలిపారు.

‘‘తమిళనాడు, భారత చరిత్ర వేర్వేరు కాదు. తమిళనాడు నుంచి తూర్పు దేశాల వరకు వేలాది సంవత్సరాలు సనాతనం కొనసాగుతున్నది. మూర్ఖంగా మాట్లాడే యువ మంత్రి ప్రభుత్వ చిహ్నాన్ని తొలగించి చూడు. ఈ ధర్మం పట్ల ఈర్ష్యా, ద్వేషం ఉంటే ఆలయాలు మఠాలకు అప్పగిస్తావా?, దేవాలయాల అదాయలతో ఖజానా నింపుకుంటున్నారు. సనాతన ధర్మం పాటించే వారి ఓట్ల అక్కర్లేదని చెప్పే దమ్ముందా?, మీ తల్లి, నానమ్మ పాటించారు కదా.. వాళ్లను కూడా నాశనం చేస్తావా? దమ్ముందా?, తెలంగాణలో హిందువులు, సనాతన ధర్మం ఆచరించే ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం ఇది. సెక్యులర్ ముసుగులో హిందూ వ్యతిరేకత పెంచింది కాంగ్రెస్. 15 నిమిషాల్లో హిందువులను నిర్మూలిస్తా అన్న మజ్లీస్‌తో అంట కాగింది కాంగ్రెస్.’’ అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

‘‘కాంగ్రెస్.. అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించింది. మైనార్టీల ఓట్ల కోసం దిగజారే పార్టీ కాంగ్రెస్. కర్ణాటకలో ఓట్ల కోసం భజరంగ్‌దళ్‌ను నిషేదిస్తామన్నారు. ప్రపంచం ఇస్లామిక్ టెర్రరిజంతో బాధ పడుతుంటే ఓట్ల వేటలో కాంగ్రెస్ ఉంది. బాంబ్‌లు పేల్చే వారి మీద సన్నాయి నొక్కులు నొక్కేది కాంగ్రెస్. సర్వేజనా సుఖినోభవంతు అనే ధర్మాన్ని నాశనం చేస్తా అంటారా?, ఉదయనిధి క్షమాపణ చెప్పాలి.. లేదంటే దేశం మొత్తం వాళ్లు మూల్యం చెల్లిస్తారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనగానే దడుచుకుంటున్నారు. అజెండా రాకముందే ఊహాగానాలతో కాంగ్రెస్‌కు భయం. జమిలి ఎన్నికలంటే గుబులు దేనికి?, మోదీ చరిష్మా, అజెండా, ప్రజల పరిపాలన వల్ల భయం మీకు. కమిటీ నివేదికకు అరు నెలల సమయం పడుతుంది. భయం, అభద్రత దేనికి?, నెహ్రూ కాలంలో జమిలి జరిగితే లేని భయం ఇప్పుడు దేనికి?, అప్పుడు నెహ్రూ చేసింది తప్పేనా ఒప్పుకుంటారా?, ప్రజల కోసం, సమయం, డబ్బులు వృధా కాకుండా ఉండటం కోసం ఆలోచన చేస్తే దేనికీ భయం. వేలాది కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖర్చు అవసరమా?.’’ అని లక్ష్మణ్ విపక్షాలను ప్రశ్నించారు.

Udayanidhi Stalin: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి

Updated Date - 2023-09-04T14:37:59+05:30 IST