Balka Suman: ‘ఢిల్లీ బీజేపీ పెద్దల ఆధ్వర్యంలో పేపర్ లీకేజీ కుట్రలు’

ABN , First Publish Date - 2023-04-05T13:48:23+05:30 IST

పేపర్ లీకేజీ వ్యవహారంలో ఉన్న వాళ్లకి డిల్లీ బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.

Balka Suman: ‘ఢిల్లీ బీజేపీ పెద్దల ఆధ్వర్యంలో పేపర్ లీకేజీ కుట్రలు’

హైదరాబాద్: పేపర్ లీకేజీ వ్యవహారంలో ఉన్న వాళ్లకి డిల్లీ బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (BRS MLA Balka Suman) ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ బీజేపీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేపర్ లీకేజీ లు ఆషామాషీగా జరగటం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమిత్ షా (Amith shah), సునీల్ బన్సల్ (Sunil Bansal) , తరుణ్ చుగ్ (Tarun Chugh) అధ్వర్యంలో కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ (Telangana) లో ప్రశాంతమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ పెద్ద నాయకుడి పర్యటన ఉందంటే ఏదో ఒక అలజడి చేస్తారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేయాలనే కుట్రతో చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే బీజేపీ నేతల కళ్ళు మండుతున్నాయన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి కుళ్లుకుంటున్నారన్నారు. బీజేపీ నేతలు నరరూప రాక్షసులని అన్నారు. బీజేపీ నేతలు కనపడితే ప్రజలు చెప్పులతో కొడతారని తెలిపారు. బీజేపీ నేతలు ఇంతటితో ఆగరని.. వాళ్ళపై నిఘా పెట్టాలని డీజీపీని కోరుతున్నామని తెలిపారు. బండి సంజయ్‌పై పీడీ యాక్ట్ వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ లోక్‌సభలో ఉండటానికి అనర్హుడన్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరుతున్నామని బాల్కసుమన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-05T13:50:30+05:30 IST