Share News

AICC Leaders: తాజ్‌కృష్ణకు చేరుకున్న ఏఐసీసీ నేతల కాన్వాయ్

ABN , First Publish Date - 2023-12-07T10:39:23+05:30 IST

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.

AICC Leaders: తాజ్‌కృష్ణకు చేరుకున్న ఏఐసీసీ నేతల కాన్వాయ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. సోనియా గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీహెచ్ యోగక్షేమాలను సోనియా, రాహుల్ గాంధీలు అడిగి తెలుసుకున్నారు.


అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో సోనియా, రాహుల్, ప్రియాంక‌లకు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జ్ ఠాక్రే, శ్రీధర్‌ బాబు ఘన స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ కాన్వాయ్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్‌కృష్ణ హోటల్‌కు ఏఐసీసీ నేతలు చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల రాక సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీస్టేడియంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో రేవంత్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2023-12-07T11:23:14+05:30 IST