Gutta Sukhender Reddy: రేవంత్, బండి సంజయ్ పాదయాత్రలు చేసి అలసిపోయారు

ABN , First Publish Date - 2023-06-10T09:50:54+05:30 IST

పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం గుత్తా మీడియాతో మాట్లాడుతూ... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రలు చేసి అలసిపోయారని యెద్దేవా చేశారు.

Gutta Sukhender Reddy: రేవంత్, బండి సంజయ్ పాదయాత్రలు చేసి అలసిపోయారు

నల్గొండ: పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy)వ్యాఖ్యలు చేశారు. శనివారం గుత్తా మీడియాతో మాట్లాడుతూ... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని యెద్దేవా చేశారు. భట్టి విక్రమార్క (Congress Leader Batti Vikramarka) పాదయాత్ర చేస్తున్న డిండి ప్రాంతంలోనే రెండు పంటలకు నీరు ఇచ్చింది కనపడడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) హాయాంలో కాలువలు తవ్వి వదిలి పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు తెచ్చిందన్నారు. భట్టికి మధిర నియోజకవర్గం తప్ప ఏదీ తెలియదని.. రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) లాగా పంచ దోతి కట్టడం తప్ప అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎవరో తెలియదని.... క్రమశిక్షణ లేకుండా నిన్న దేవరకొండ నియోజకవర్గంలో తన్నుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-06-10T09:50:54+05:30 IST