Share News

AP News: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై తొలిసారి స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

ABN , Publish Date - Mar 10 , 2024 | 12:55 PM

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పొత్తులను ఎవరూ స్వాగతించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీతో పొత్తు ఎందుకు అని టీడీపీ, జనసేనలను ఆమె ప్రశ్నించారు. అసలు ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు హోదాపై ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ‘‘ ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు. గతంలో పొత్తుతో గెలిచారు. ఆ తరువాత మోదీని తిట్టారు. పవన్ కళ్యాణ్, జగన్‌లను కూడా నేను అడుగుతున్నా. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు’’ అని అన్నారు.

AP News: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై తొలిసారి స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

విజయవాడ: తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పొత్తులను ఎవరూ స్వాగతించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీతో పొత్తు ఎందుకు అని టీడీపీ, జనసేనలను ఆమె ప్రశ్నించారు. అసలు ఏపీలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు హోదాపై ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ‘‘ ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు. గతంలో పొత్తుతో గెలిచారు. ఆ తరువాత మోదీని తిట్టారు. పవన్ కళ్యాణ్, జగన్‌లను కూడా నేను అడుగుతున్నా. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు. అందుకే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీయలేదు. బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు?. బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం‌ కాబట్టే అవినీతిని పట్టించుకోరు. బీజేపీకి తొత్తులుగా ఉంటే సీబీఐ, ఈడీ పని చేయవు. మిమ్మల్ని ప్రశ్నిస్తే వెంటనే వారు వాలిపోతారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. అంత డబ్బులతో జనాలను పోగేసుకుని మళ్లీ ‌మాయ చేస్తున్నారు. బీజేపీతో అంటకాగే పార్టీ లకు ప్రజలు బుద్ధి చెప్పాలి’’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు.


ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదు: షర్మిల

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ లేదని వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ పదేళ్లల్లో ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?, ఏపీలో కోటి ఉద్యోగాలు రావాల్సి ఉంది.. ఎన్ని ఇచ్చారు?. బీజేపీ అందరినీ మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో‌ విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. 25 ఏళ్ల‌లోపు ఉన్న డిగ్రీ, గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ కోర్సుల వారికి అప్రంటీస్ ద్వారా ఏడాదికి లక్ష ఇస్తాం. పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొస్తాం. జొమాటో, క్యాబ్ హోల్డర్స్ వంటి వారికి ఎటువంటి భద్రతా లేదు. ఇటువంటి వారికి సోషల్ సెక్యూరిటీ ఉండేలా చట్టాలు తీసుకొస్తాం. ‘యువ రోషిణి’ ద్వారా 5 వేల‌ కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. 40 ఏళ్ల లోపు వారికి రుణాలు ఇచ్చి ఆర్థికంగా నిలబడేలా చేస్తాం. రాహుల్ గాంధీ యువత, నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారు’’.

‘‘ఏపీలో లక్షల మందికి ఉద్యోగాలు లేవు. డిగ్రీ ఉన్నా పది వేల లోపు జీతాలకు పని చేసుకుంటున్నారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అని హామీ ఇచ్చి జగన్ అన్న అధికారంలోకి వచ్చారు. ఆనాడు చంద్రబాబును తిట్టిన జగనన్న ఈ ఐదేళ్లల్లో ఏం‌చేశారో ప్రజలుకు చెప్పాలి. కనీసం 2 శాతం కూడా ప్రభుత్వం శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మెగా డీఎస్సీ పేరుతో 23 వేల ఉద్యోగాలు అని చెప్పారు. నేడు 6 వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ విడుదల చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు నోటీపికేషనా?. ఇదేనా యువతపై జగనన్నకి ఉన్న చిత్తశుద్ధి?. ఐదేళ్లుగా ఏం చేస్తున్నారు. ‌గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా? నాడు చంద్రబాబు ఏడు వేల ఉద్యోగాలు ఇస్తే సిగ్గులేదా అన్నారు. మరి మోసం చేసిన జగన్ను ఏమని పిలవాలిఝ? అనాలి?. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే అరెస్టు చేశారు. కేసులు పెట్టారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది?. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులు అని జగన్ నిరూపించుకున్నారు. ఈ మోసాలను మేము‌ ప్రజలకు వివరిస్తాం’’ అని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

Updated Date - Mar 10 , 2024 | 12:56 PM