Share News

Chandrababu: విమర్శలకు సీబీఎన్ సమాధానమిస్తారా?

ABN , Publish Date - May 29 , 2024 | 11:42 AM

అమెరికా పర్యటనా ముగించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబు దంపతులకు అభిమానులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించారు.

Chandrababu: విమర్శలకు సీబీఎన్ సమాధానమిస్తారా?

హైదరాబాద్: అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబు దంపతులకు అభిమానులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించారు. సీఎం సీఎం అంటూ నినాదాలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మారుమోగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్ నివాసానికి చంద్రబాబు బయలుదేరారు.


బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు


పెదవి విప్పుతారా?

ఎన్నికల అనంతరం కొద్ది రోజుల పాటు విశ్రాంతి కోసం చంద్రబాబు అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గరపడుతుండటంతో ఆయన తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఈ కొద్ది రోజుల పాటు చంద్రబాబు రాజకీయాల జోలికి రాకుండా ప్రశాంతంగా గడిపారు. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఎలాంటి సమాధానం చెబుతారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమంటూ వైసీపీ కూస్తున్న కారు కూతలకు సమాధానం చెప్పే టైం వచ్చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి చంద్రబాబు విమర్శలపై పెదవి విప్పుతారా? లేదంటే ఒక్కసారే పార్టీ విజయంతో సమాధానమిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Updated Date - May 29 , 2024 | 05:34 PM