Share News

Bhuvaneshwari: చిత్తూరులో కార్యకర్త మోహన్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

ABN , Publish Date - Feb 23 , 2024 | 02:38 PM

Andhrapradesh: జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

Bhuvaneshwari: చిత్తూరులో కార్యకర్త మోహన్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

చిత్తూరు, ఫిబ్రవరి 23: జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-10-2023న మోహన్ నాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలో మోహన్ నాయుడు కుటుంబ సభ్యులను భువనమ్మ ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. మోహన్ నాయుడు కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు. మోహన్ నాయుడు పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచిత విద్య అందిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 02:38 PM