Share News

CM Chandrababu : వినూత్నంగా ఏపీ భవన్‌

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:19 AM

దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌(ఏపీ) భవన్‌కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

CM Chandrababu : వినూత్నంగా ఏపీ భవన్‌

  • కొత్త భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష

  • అమరావతికి తిరుగుపయనం

న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌(ఏపీ) భవన్‌కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆదివారమిక్కడ తన అధికారిక నివాసం 1-జన్‌పథ్‌లో.. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌తో గంటకు పైగా చర్చించారు.

భవన్‌ డిజైన్లపై కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి వెళ్లారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన 16 మంది సర్పంచ్‌లు ఆయన్ను కలిశారు. ఆగస్టు 15న ఎర్రకోటలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమకు గౌరవం లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - Aug 19 , 2024 | 04:19 AM