Share News

AP NEWS: మేము చనిపోతాం.. అనుమతి ఇవ్వండి.. వృద్ధ దంపతుల ఆవేదన

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:47 PM

తాము చనిపోతాం.. అనుమతి ఇవ్వాలని ఏలూరులో కలెక్టర్‌ను కలిసి వృద్ధ దంపతులు కోరారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

AP NEWS: మేము చనిపోతాం.. అనుమతి ఇవ్వండి..  వృద్ధ దంపతుల ఆవేదన

ఏలూరు జిల్లా: తాము చనిపోతాం.. అనుమతి ఇవ్వాలని ఏలూరులో కలెక్టర్‌ను కలిసి వృద్ధ దంపతులు కోరారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని కలెక్టర్‌‌కు విజ్ఞప్తి చేశారు. తమ భూమిలోకి వెళ్లనివ్వకుండా గ్రామ పెద్దలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామ పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.


ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కేసు పెట్టారన్న కోపంతో గ్రామ పెద్దల వేధింపులు మరింత పెరిగాయని వృద్ధ దంపతులు అన్నారు. తమను ఊరి నుంచి వెలివేశారని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు వేధింపులు భరించలేక కారుణ్య మరణం కోరుతూ ఏలూరులో కలెక్టర్‌‌కు వృద్ధ దంపతులు వినతిపత్రం అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..

రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌

అతని బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

జగన్‌ తీరును తప్పుపడుతున్న నాయకులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 21 , 2024 | 05:33 PM