Share News

Pawan Kalyan: జులై 1 నుంచి పిఠాపురంలో పవన్ పర్యటన

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:57 PM

జులై 1వ తేదీ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహించనున్నారు.

Pawan Kalyan: జులై 1 నుంచి  పిఠాపురంలో పవన్ పర్యటన

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో జులై 1వ తేదీ నుంచి పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహించనున్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. మూడు రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు. స్వామివారిని దర్శించుకొని పూజాధికాలు పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 10:06 PM