Share News

AP Politics: ఎన్నికల ముంగిట వైసీపీకి షాక్.. పార్టీని వీడిన కీలక నేత..

ABN , Publish Date - May 02 , 2024 | 07:47 PM

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని అమరావతి(Amaravati MPP) ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్(Hanumantharao Yadav) వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.

AP Politics: ఎన్నికల ముంగిట వైసీపీకి షాక్.. పార్టీని వీడిన కీలక నేత..
Amaravati MPP Hanumantharao

అమరావతి, మే 02: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని అమరావతి(Amaravati MPP) ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్(Hanumantharao Yadav) వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు మేకల హనుమంతరావు. పార్టీ పెద్దల తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వైఖరితో విసుగుచెందామని.. సంవత్సరన్నర కాలంగా వేధింపులకు గురిచేశారని హనుమంతరావు యాదవ్ ఆరోపించారు. బీసీల ఎదుగులను ఆయన ఓర్వలేకపోతున్నారని అన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చినా కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ పెద్దలకు సమాచారం అందించినా పట్టించుకోలేదని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో వరుసగా జరుగుతున్న అవమానాలను భరించలేక తమ అనుచరులతో సహా పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని హనుమంతరావు తెలిపారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 02 , 2024 | 07:47 PM