Share News

YSRCP: అర్ధరాత్రి కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి

ABN , Publish Date - May 08 , 2024 | 08:45 AM

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధరాత్రి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత మోటార్ సైకిల్‌తో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.

YSRCP: అర్ధరాత్రి కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధరాత్రి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత మోటార్ సైకిల్‌తో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రామకృష్ణ అనే టీడీపీ నాయకుడి తలకు తీవ్ర గాయమైంది. రామకృష్ణను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నల్లజర్లలో పోలీసులు మోహరించారు.

PM Modi: వేములవాడ, వరంగల్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన


ఎన్నికలంటే ప్రచారం సర్వసాధారణం. ఎవరి ప్రచారం వాళ్లు చేసుకునే వరకూ బాగానే ఉంటుంది. రెచ్చగొట్టడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం వంటివి చేస్తేనే సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నది అదే. అధికారంలో ఉన్నామన్న అహమో.. మరొకటో కానీ ఇష్టానుసారంగా వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టడం.. ఘర్షణకు దిగడం.. ఆపై దాడికి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు సైతం వైసీపీ చేస్తున్న దుశ్చర్యలను అడ్డుకోలేక పోతున్నారు. దీంతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. మరింత ఎక్కువగా అలజడి సృష్టిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - May 08 , 2024 | 10:15 AM