Share News

AP News: విజయవాడ మదర్సాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థి మృతి

ABN , Publish Date - Jun 28 , 2024 | 08:50 PM

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి.

AP News: విజయవాడ మదర్సాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థి మృతి

విజయవాడ: విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి. గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) మృతిచెందింది. మిగిలిన విద్యార్థులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అందరూ బాగానే ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది తిరిగి పంపించారు. ఆహారం కలుషితమే ఇందుకు కారణమని విద్యార్థులు అంటున్నారు.


విద్యార్థుల ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన కరిష్మా బంధువులు మదర్సా ఎదురుగా ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. మదర్సాసాలోని మిగిలిన విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఉర్దూ విద్యార్థులను స్వస్థలాలకు తల్లిదండ్రులు, బంధువులు తీసుకెళ్తున్నారు.

Updated Date - Jun 28 , 2024 | 08:51 PM