Share News

CM Chandrababu: గన్నవరం టీడీపీ మహిళా నేత రమ్యకృష్ణ మృతి బాధాకరం

ABN , Publish Date - Jun 27 , 2024 | 07:55 AM

గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా మండవ రమ్యకృష్ణ ఉన్నారు. ఆమె షిర్డీ నుంచి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. రమ్యకృష్ణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రమ్యకృష్ణ మృతి బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: గన్నవరం టీడీపీ మహిళా నేత రమ్యకృష్ణ మృతి బాధాకరం

అమరావతి: గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా మండవ రమ్యకృష్ణ ఉన్నారు. ఆమె షిర్డీ నుంచి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. రమ్యకృష్ణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రమ్యకృష్ణ మృతి బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ దమణకాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని, వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులతో రమ్యకృష్ణ కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రమ్యకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ పార్టీ రమ్యకృష్ణ కుటుంబానికి అండగా ఉంటుందని వెల్లడించారు.

Updated Date - Jun 27 , 2024 | 07:56 AM