Share News

నల్లమాడ వాగులో విషాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరు గల్లంతు

ABN , Publish Date - May 29 , 2024 | 01:56 PM

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల మండలం అప్పికట్ట సమీపంలోని నల్లమాడ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభించగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

నల్లమాడ వాగులో విషాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరు గల్లంతు

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల మండలం అప్పికట్ట సమీపంలోని నల్లమాడ వాగులో నలుగురు గల్లంతయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభించగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. బాధితులు బంధువుల చూసేందుకు పొన్నూరు వచ్చారు. సూర్యలంక బీచ్‌కు బయలుదేరి మార్గమధ్యంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. గల్లంతైన నందు(38), సునీల్(35), కిరణ్(30), సన్నీ(12) ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

For more AP news and Telugu news..

Updated Date - May 29 , 2024 | 01:56 PM