Share News

AP Politics: ఈనెల 28న టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు..

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:55 PM

ఈనెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి(TDP AP President)గా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌(Palla Srinivasa Rao Yadav) బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరి (Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

AP Politics: ఈనెల 28న టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు..

అమరావతి: ఈనెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి(TDP AP President)గా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌(Palla Srinivasa Rao Yadav) బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు నాయకులు హాజరుకానున్నారు.


గతంలో విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేయడంతో గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. జూన్ 16న పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

AP Govt: జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి..

AP Politics: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు..

Updated Date - Jun 26 , 2024 | 04:59 PM