Share News

Andhra Pradesh: చంద్రబాబుతో బేటీ కానున్న పవన్.. డిన్నర్‌మీట్‌లో కీలక చర్చలు!

ABN , Publish Date - Jan 13 , 2024 | 05:48 PM

అమరావతి, జనవరి 13: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాన్ కలవనున్నారు. ఇవాళ రాత్రి డిన్నర్‌ మీట్‌లో ఇరువురు నేతల మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ మీట్‌లో పవన్, చంద్రబాబుతో పాటు.. ఇరు పార్టీలకు చెందిన మరికొందరు నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

Andhra Pradesh: చంద్రబాబుతో బేటీ కానున్న పవన్.. డిన్నర్‌మీట్‌లో కీలక చర్చలు!
Pawan Kalyan - Chandrababu

అమరావతి, జనవరి 13: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాన్ కలవనున్నారు. ఇవాళ రాత్రి డిన్నర్‌ మీట్‌లో ఇరువురు నేతల మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ మీట్‌లో పవన్, చంద్రబాబుతో పాటు.. ఇరు పార్టీలకు చెందిన మరికొందరు నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటు పై ప్రాధమికంగా అవగాహనకు వచ్చారు ఇరువురు నేతలు. ఎన్నిస్థానాల్లో పోటీ చేయాలి, ఎవరెవరికి ఎక్కడ కేటాయించాలనే దానిపై ఈరోజు రాత్రి చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచాం. ఈ డిన్నర్ భేటీ దాదాపుగా రెండు గంటల పాటు జరిగే అవకాశం ఉంది.

తిరిగి ఆదివారం ఉదయం 8 గంటలకు రాజధాని అమరావతిలోని మందడంలో భోగి మంటల వేడుకలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దగ్దం చేయనున్నారు నేతలు.

Updated Date - Jan 13 , 2024 | 05:48 PM