Nakka Ananda Babu: రాత్రంతా వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు
ABN , Publish Date - Jan 01 , 2024 | 08:18 PM
జిల్లాలో రాత్రంతా వైసీపీ నేతలు ( YCP Leaders ) అరాచకం సృష్టించారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ( Nakka Ananda Babu ) తెలిపారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి ఏడాది నివాళి అర్పిస్తారని.. ఆ ప్రాంతంలో మంత్రి విడదల రజని ఆఫీస్ పెట్టిందని అక్కడ ఆంక్షలు విధించారని నక్కా ఆనంద బాబు చెప్పారు.
గుంటూరు జిల్లా: జిల్లాలో రాత్రంతా వైసీపీ నేతలు ( YCP Leaders ) అరాచకం సృష్టించారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ( Nakka Ananda Babu ) తెలిపారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి ఏడాది నివాళి అర్పిస్తారని.. ఆ ప్రాంతంలో మంత్రి విడదల రజని ఆఫీస్ పెట్టిందని అక్కడ ఆంక్షలు విధించారని చెప్పారు. మంత్రి రజని ఆఫీస్ పెడుతుంది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాకుండా అడ్డుకున్నారని.. ఈ సందర్భంలో రజని ఆఫీస్పై రెండు రాళ్లు పడ్డాయట.. దీంతో పోలీసులు, వైసీపీ నేతలు నానా యాగీ చేశారన్నారు. రోడ్డుపై వెళ్లే వాళ్లను అడ్డుకోని స్టేషన్లకు తరలించి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి వత్తిడితో అమాయకులపై కేసులు పెట్టారని చెప్పారు. విడదల రజని ఇన్చార్జ్ రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేదన్నారు. వైసీపీలోని గ్రూపు తగాదాలతో రాళ్లు వెసుకున్నారనే అనుమానం ఉందన్నారు.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నామని నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు.