Share News

Prakasam Barrage: ఏడురోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటే లక్ష్యంగా సాగుతున్న పనులు

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:00 PM

Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు ఊపందుకున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ రెండు గేట్ కౌంటర్ వెయిట్‌లు డామేజ్ అయ్యాయి. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్‌లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌నువెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

Prakasam Barrage: ఏడురోజుల్లో బ్యారేజీ గేట్ల ఏర్పాటే లక్ష్యంగా సాగుతున్న పనులు
Prakasam Barrage

విజయవాడ, సెప్టెంబర్ 5: ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) గేట్ రిపేర్ పనులు ఊపందుకున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ రెండు గేట్ కౌంటర్ వెయిట్‌లు డామేజ్ అయ్యాయి. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్‌లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌నువెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను తప్పించేందుకు క్రేన్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్


బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతు పనులు చేస్తోంది. పోలవరం గేట్లు, పులిచింతల, ప్రాజెక్టుల గేట్లను బెకెమ్ ఇన్ ఫ్రా ఏర్పాటు చేసింది. బ్యారేజీలో ఇరుక్కున్న నాలుగు పడవలను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించనున్నారు. తొలుత 67,69 గేట్లు మూసి ఆ తర్వాత పడవలను తొలగించనున్నారు. ఏడు రోజుల్లో బ్యారేజీ గేట్లు ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.  నిపుణులు కన్నయ్యనాయుడు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, డ్యామ్‌ సేఫ్టీ చీఫ్‌ ఇంజినీర్‌గా రత్నకుమార్‌, విజయవాడ సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌ కె.వి.కృష్ణారావు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఈఈ ఇంజినీర్‌ విజయసారథి పర్యవేక్షణలో మరమ్మతు పనులు సాగుతున్నాయి.


డ్యామేజ్ జరిగిందిలా...

కాగా.. రెండు రోజు క్రితం కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయింట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఈనెల 2న కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి.

Delhi High Court: వికీపీడియాను మందలించిన ఢిల్లీ హైకోర్టు.. కారణమిదే..


మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ ఇక్కడ ఇరుక్కుపోయింది. విషయం తెలిసిన ప్రభుత్వం... జలవనరుల శాఖ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడి పిలుపించగా.. అదే రోజు రాత్రి ఆయన హుటాహుటిన బ్యారేజీ వద్దకు చేరుకుని విరిగిన గేట్లను పరిశీలించారు. ఈ రెండు చోట్ల గేట్లకు నష్టంలేదని కూడా నిర్ధారించారు. గేట్లు విరిగి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చారు. బ్యారేజీకి ఈ వైపు నుంచి ఆ వైపు మొత్తం నడుచుకుంటూ వెళ్లి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను పరిశీలించారు. 64, 69వ ఖానాల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్లను చూశారు. ఆపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.


ఇవి కూడా చదవండి...

Trading Scam: అధిక లాభాల పేరుతో ఘరానా మోసం.. అసోంలో 2 వేల 200 కోట్ల కుంభకోణం

AP Flood: మైలవరం ఎర్ర చెరువుకు గండి... మైక్‌ల ద్వారా ప్రచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 03:05 PM