Share News

YCP: నూజివీడులో రెచ్చిపోతున్న వైసీపీ కౌన్సిలర్లు

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:47 PM

నూజివీడు ( Nujiveedu ) లో వైసీపీ ( YCP ) కౌన్సిలర్లు రెచ్చిపోతున్నారు. నూజివీడు పోలీసులను వైసీపీ రౌడీలు పరుగులు పెట్టిస్తున్నారు. ఫ్లెక్సీల అంశంలో మేకల అనిల్‌, రామగిరి రాంబాబు మధ్య వార్‌ నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య రాజీ కోసం పంచాయితీ పెట్టారు. ఇందులో ఇరువర్గాల కౌన్సిలర్ల అనుచరులు మరోసారి దాడులకు పాల్పడ్డారు.

YCP: నూజివీడులో రెచ్చిపోతున్న వైసీపీ కౌన్సిలర్లు

ఏలూరు: నూజివీడు ( Nujiveedu ) లో వైసీపీ ( YCP ) కౌన్సిలర్లు రెచ్చిపోతున్నారు. నూజివీడు పోలీసులను వైసీపీ రౌడీలు పరుగులు పెట్టిస్తున్నారు. ఫ్లెక్సీల అంశంలో మేకల అనిల్‌, రామగిరి రాంబాబు మధ్య వార్‌ నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య రాజీ కోసం పంచాయితీ పెట్టారు. ఇందులో ఇరువర్గాల కౌన్సిలర్ల అనుచరులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ఎంట్రీతో వైసీపీ కార్యకర్తలు పారిపోయారు. ఈ దాడికి నిరసనగా ఓ వర్గానికి చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌పై మరో వర్గం దాడి చేసింది. ముందస్తు జాగ్రత్తగా నూజివీడులో పోలీసుల మోహరించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Updated Date - Jan 07 , 2024 | 10:47 PM