Share News

AP Politics: రాబోయే ఎన్నికల్లో పోటీపై బాలినేని కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 23 , 2024 | 09:54 PM

రాబోయే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని.. ఇవే చివరి ఎన్నికలు అని తెలిపారు.

AP Politics: రాబోయే ఎన్నికల్లో పోటీపై బాలినేని కీలక వ్యాఖ్యలు

ప్రకాశం: రాబోయే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని.. ఇవే చివరి ఎన్నికలు అని తెలిపారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ... తన తర్వాత మా అబ్బాయి పోటీలో ఉంటారని చెప్పారు. ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. మాగుంట సీటు విషయంలో వైసీపీ హై కమాండ్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ లోపు ఒంగోలులో 25 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 09:54 PM