Share News

AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:58 PM

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.

AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..
AARA Exit Polls

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు. రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారని.. స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ లేదా వైసీపీ నుంచి ఎవరు గెలిచినా 10 నుంచి 20 వేల మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉందని ఆరా సంస్థ వెల్లడించింది.

AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 06:59 PM