Share News

CM Ramesh: వైసీపీ ఏపీకి తీరని అన్యాయం చేసింది

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:48 PM

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపారు.

CM Ramesh:  వైసీపీ ఏపీకి తీరని అన్యాయం చేసింది
CM Ramesh

విశాఖపట్నం: ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపారు. సభ్యత్వ నమోదును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని, పార్టీ పైన ఆసక్తి ఉన్నవారిని సభ్యులుగా తీసుకోవాలని కోరారు. ప్రజలకు బీజేపీ పార్టీ ప్రయోజనాలను, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయలను వివరించి బీజేపీ పట్ల ఆకర్షితుల ఏవిధంగా నాయకుల కృషి చేయాలని అన్నారు.తాను విశాఖ జిల్లాలోనూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.


జగన్ దోపిడీకి పాల్పడ్డారు: విష్ణుకుమార్ రాజు

ఫార్మా ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి అనడం దుర్మార్గమని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. బాధితులు ఆశ్చర్యపోయే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షతగాత్రులను పరామర్శించి నష్టపరిహారం అందజేశారని అన్నారు. పరిశ్రమలలో ప్రమాదాల పురావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని విష్ణుకుమార్ రాజు చెప్పారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి అభ్యర్థి బరిలో లేకపోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారని అన్నారు. బొత్స కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపితే హర్షించే వాళ్లమని చెప్పారు. జగన్ గత ఐదేళ్లలో అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనంతో రుషికొండలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

రుషికొండా భవనలు వివరాలు తెలపమని ఏపీటీడీసీకి త్వరలో లేక రాస్తానని చెప్పారు. కాంగ్రెస్ దేశానికి చేస్తోన్న దుర్మార్గాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. జమ్మూ& కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాశ్మీర్‌లో రెండు జెండాలు ఉండాలని కోరుకుంటోందని అన్నారు. ఇది దేశప్రజలెవ్వరూ హర్షించరని అన్నారు. వారితో రాహుల్ గాంధీ కలిసి ఎన్నికలకు వెళ్లడం దుర్మార్గమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


విశాఖలో ఊహించని పరిణామాలు: సోము వీర్రాజు

విశాఖలో ఊహించని పరిణామాలను చూస్తున్నామని.. పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకూడదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. ఫార్మా ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారని అన్నారు. ఫార్మా కంపెనీలో ప్రమాదాలను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిన్న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయని సోము వీర్రాజు వివరించారు.


గత ఐదేళ్ల పరిపాలనపై అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలింరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.800 కోట్లను గ్రామపంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వానికి గ్రామీణ అభివృద్ధిపై అవగాహన లేదన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రూ.500 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు తప్ప విశాఖను అభివృద్ధి చేయలేదని సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - Aug 24 , 2024 | 01:52 PM