Share News

Hyderabad: జల్సాలకు బానిసయ్యారు.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు.. కట్ చేస్తే..

ABN , Publish Date - Jan 24 , 2024 | 05:04 PM

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: జల్సాలకు బానిసయ్యారు.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు.. కట్ చేస్తే..

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరిని రిమాండ్ కు పంపించారు. షేక్ అమీర్, షేక్ ఫెరోజ్, ఆమీర్ అనే ముగ్గురు యువకులు విలాసాలకు అలవాటు పడి, తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్నారు.

ఈనెల 13న మీర్పేట్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్టు చేసినట్లు మీర్పేట్ సీఐ వెల్లడించారు. వీరి నుంచి రూ.6,80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరి పై సుమారుగా 20 పైగా కేసును నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ పలు కేసులు ఉన్నాయని వివరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 05:04 PM