Share News

Kangana Ranaut: ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై..!!

ABN , Publish Date - May 19 , 2024 | 04:32 PM

బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.

Kangana Ranaut: ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై..!!
Kangana Ranaut

బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.


కంగనా రనౌత్ మండీ లోక్ సభ నుంచి బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. సినిమాలపై విరక్తితో ఉన్నారు. మండీ నుంచి గెలిస్తే సినిమాలను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. గ్యాంగ్ స్టార్ అనే సినిమాతో కంగనా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్స్న్ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ మూవీ తీస్తున్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో నెలకొన్న పరిస్థితులను తెరపై చూపించబోతున్నారు.


సినీ ఇండస్ట్రీలో ఉంటూనే బాలీవుడ్‌పై కంగనా విషం కక్కుతుంటారు. ‘సినీ ఇండస్ట్రీ అబద్ధం అంటుంటారు. ఇక్కడ విచిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రేక్షకులను అలరించే గాలి బుడగ లాంటి ప్రపంచం అంటారు. తాను ఉద్వేగభరిత వ్యక్తిని అని.. జాబ్ చేయాలని అనుకోలేదు. సినిమాలకు సంబంధించి కథలు రాస్తుంటాను. తనకు పాత్ర చేయడం విసుగుచెందితే దర్శకత్వం వహిస్తాను.. లేదంటే నిర్మిస్తాను అని’ కంగనా రనౌత్ స్పష్టం చేశారు.



Read Latest
National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 04:32 PM