Share News

PM Modi: గెలుపు దిశగా హర్యానా.. మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 08 , 2024 | 02:09 PM

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం దాదాపు ఖాయం కావడంతో మోదీ కార్యకర్తలను ఉద్దేశంచి ప్రసంగించనున్నారు.

PM Modi: గెలుపు దిశగా హర్యానా.. మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 'హ్యాట్రిక్' విజయం దిశగా దూసుకు వెళ్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. ఇందుకోసం స్వాగత సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

Vinesh Phogat: వరించిన అదృష్టం.. మల్లయోధురాలు ఘన విజయం..


కాగా, మధ్యాహ్నం 2 గంటల వరకూ వెలువడిన ఫలితాలను బట్టి బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తూ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లలో ఆధిక్యం నిలుపుకొంటోంది. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటిమి మెజారిటీ మార్కును దాటి 48 సీట్లలో ఆధిక్యత కొనసాగిస్తోంది.


For More National News and Telugu News..

Also Read:

ఖాతా తెరవని 'ఆప్'.. కాంగ్రెస్ ఓట్లకు గండి

Updated Date - Oct 08 , 2024 | 02:09 PM