Share News

Delhi : ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ భేటీ

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:08 AM

దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.

Delhi : ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ భేటీ

  • హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

న్యూఢిల్లీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.

ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న టీడీపీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలు, వారికి ప్రభుత్వం ఏ మేరకు మేలు చేయగలదన్న అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏ మేరకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నారు?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా శాఖల్లో రోస్టర్‌ విధానం అమలవుతోందా? లేదా? అన్న విషయాలపై కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల వివరాలను సేకరించి, దానికి అనుకూలంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ఎంపీ ప్రసాదరావు తెలిపారు.

బ్యాంకుల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రుణాలు తప్పకుండా మంజూరు చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేయాలని, ప్రభుత్వ ఆశయాన్ని గౌరవించాలని బ్యాంకులకు ఆయన సూచించారు.

Updated Date - Aug 25 , 2024 | 05:08 AM