Share News

Congress: ఎంపీల చేరికలు షురూ.. మరింత పెరిగిన కాంగ్రెస్ బలం..

ABN , Publish Date - Jun 06 , 2024 | 08:33 PM

రోజులు గడుస్తున్నా కొద్ది హస్తిన రాజకీయాలు మరింత రక్తికట్టిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది మంది సభ్యులు మాత్రమే తక్కువగా ఉండటంతో.. ఆ సభ్యులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే.. చేరికలను ప్రోత్సహిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సంగ్లీ లోక్‌సభ స్వతంత్ర ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు..

Congress: ఎంపీల చేరికలు షురూ.. మరింత పెరిగిన కాంగ్రెస్ బలం..
Congress

ముంబై, జూన్ 06: రోజులు గడుస్తున్నా కొద్ది హస్తిన రాజకీయాలు మరింత రక్తికట్టిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది మంది సభ్యులు మాత్రమే తక్కువగా ఉండటంతో.. ఆ సభ్యులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే.. చేరికలను ప్రోత్సహిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సంగ్లీ లోక్‌సభ స్వతంత్ర ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఎంపీ విశాల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. విశాల్ చేరికతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 100కు చేరింది.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఇండియా కూటమి మొత్తం కలిపి 232 స్థానాల్లో గెలిచింది. అధికారం చేపట్టాలంటే 272 సీట్లు అవసరం. అయితే, ఆ మేజిక్ ఫిగర్‌కు ఇంకా 40 సీట్లు అవసరం. ఇప్పుడు ఒక ఎంపీ చేరడంతో క్రమంగా కాంగ్రెస్ బలం పెరుగుతోంది. మరికొంత మంది ఎంపీలు కూడా చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

For More National News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 08:33 PM