Share News

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:41 AM

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ, జూన్‌ 6: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత స్థానాన్ని దక్కించుకోనుంది. ఈ హోదా దక్కాలంటే లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 10ు సాధించాలి. కానీ 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అన్ని సీట్లు రాలేదు.

Updated Date - Jun 07 , 2024 | 07:04 AM