Home » Mallikarjun Kharge
లోక్సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో 'ఇండియా' కూటమి ఆధిక్యంలో ఉందని, మొత్తంగా 273కు పైగా సీట్లను తము కూటమి గెలుచుకోవడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.
ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఎన్నికల పోలింగ్ వేళ.. ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో దేశ జీడీపీ(GDP)లో తయారీ రంగ వాటాను 14 నుంచి 20 శాతానికి పెంచుతామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) తెలిపారు.
ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసిన పోలింగ్ వివరాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు రాసిన లేఖల్లో ఆరోపించడంపై ఈసీ తీవ్రంగా స్పందించింది.
దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని తీసివేసే బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. దేశపు రాజ్యాంగాన్ని మార్చాలనుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యక్తం చేసిన అనుమానాలు, ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధిని ప్రశ్నించడంపై ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిపిన దాడిగా పేర్కొంది. ఈ మేరకు ఖర్గేకు ఈసీ శుక్రవారంనాడు లేఖ రాసింది.