Share News

Union Budget 2024: బడ్జెట్‌పై రచ్చ.. సీఎం నితీష్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారుగా..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 07:06 PM

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) కీలకంగా వ్యవహరించాయి.

Union Budget 2024: బడ్జెట్‌పై రచ్చ.. సీఎం నితీష్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారుగా..!

న్యూఢిల్లీ, జులై 23: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంలో.. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కీలకంగా వ్యవహరించింది. మోదీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బిహార్‌ రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల కోసం రూ.26 వేల కోట్లను కేటాయించింది. దేశంలొని ఇతర రాష్ట్రాలను పక్కకు నెట్టి.. బిహార్‌‌కు అన్ని వేల కోట్ల రూపాయిలు కేటాయించడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

Also Read: Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు


అదీకాక బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిహార్ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను ఆమె సోదాహరణగా వివరించారు. ఆ రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రహదారులు సైతం నిర్మిస్తామని ప్రకటించారు. అందులోభాగంగా పట్నా - పుర్ణియా ఎక్స్‌ప్రెస్ వే, బాక్సర్- భాగల్‌పూర్ హైవే, బుద్ద గయా- రాజ్‌గిర్- వైశాలి-దర్భంగాను కలుపుతూ రహదారి నిర్మాణం, బాక్సర్ వద్ద గంగా నదిపై రెండు లైన్ల బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

Also Read: Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..

Also Read: Union Budget 2024: వీటి ధరలు తగ్గుతాయి.. వీటి ధరలు పెరుగుతాయి.


అలాగే బుద్ద గయా, గయాలను సైతం పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరోవైపు ఇటీవల బిహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా వంతెనలు కులిపోయిన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో గత పాలకుల పాలనపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అలాంటి వేళ.. దేశంలో బిహార్‌‌ రాష్ట్రానికి రూ. 26 వేల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించడంపై సోషల్ మీడియాలో మీమ్స్ దూసుకు పోతున్నాయి.

Also Read: Union Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేశ్

Also Read:Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు


మరోవైపు బిహార్‌కు ప్రత్యేక హోదా లేకుంటే ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని తాజాగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంపై సీఎం నితీష్ కుమార్ తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కీలక భాగస్వాముల్లో ఒకరైన నితీష్ కుమార్‌ను శాంతి పరిచేందుకు మోదీ ప్రభుత్వం.. ఈ మేరకు భారీగా కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ ఇలా ఉన్నాయి...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 23 , 2024 | 07:55 PM