Share News

President Speech: ప్రజల ఆకాంక్షాలను నెరవేరుస్తున్నాం.. అభివృద్ధిలో మేమే టాప్

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:27 AM

దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.

President Speech: ప్రజల ఆకాంక్షాలను నెరవేరుస్తున్నాం.. అభివృద్ధిలో మేమే టాప్
Murmu and Modi

దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు. మొదటగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యారన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతి సభ్యుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా ఎంపీలు పనిచేయాలన్నారు. ప్రజల సుస్థిరతకు పట్టాం కట్టారని.. విశ్వమంతా దేశంలో జరిగిన ఎన్నికలను పరిశీలించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తోందన్నారు. అభివృద్ధిలో తమ ప్రభుత్వం పరుగులు పెడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మౌలిక వసతలు కల్పలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని.. రైతలుు, మహిళలు, యువత సాధికరత దిశగా ప్రభుత్వం పయనిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 27 , 2024 | 11:32 AM