Home » Lok Sabha
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్వాదీపార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.
పద్దెనిమిదో లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.
లోక్సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు. ఆ పార్టీ తరపున లోక్సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి.
ఎన్నికల్లో గెలవడం అంటే అంతా ఈజీ కాదు.. వార్డు సభ్యుడిగా గెలవడానికే చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ కావడమంటే మామూలు విషయమా.. కానీ ఈ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీలు కావడం ఎంతో ఈజీ.
పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి 18వ లోక్సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు.