Home » Lok Sabha
Waqf Bill Voting: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వక్ఫ్ బిల్లును తీసుకురావాలని డిసైడ్ అయిన కేంద్ర సర్కార్.. ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది.
లోక్సభలో గురువారం రికార్డు నమోదైంది, 202 మంది ఎంపీలు జీరో అవర్లో ప్రసంగించారు. స్పీకర్ ఓం బిర్లా అదనంగా సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు
రెండు తెగల మధ్య రేగిన విబేధాల కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని అందుపులోకి తీసుకువచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొద్ది నెలలుగా పరిస్థితి సద్దుమణిగినట్లే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్ 40ను రద్దు చేసి, వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్కు మార్గం సుగమం చేశారు
వక్ఫ్ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. బిల్లును ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా అభివర్ణిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని వెల్లడించింది
దేశ ప్రజల మద్దతు బిల్లుకు ఉందని లోక్సభలో చర్చ సందర్భంగా అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన వ్యహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ముస్లింల మత పరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహేనని, కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కేంద్రం హోం మంత్రి అమిత్షా అన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
బిల్లుపై చర్చలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం పదపదే అభ్యంతరాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమం నుంచి ఏ అనివార్యతల కారణంగా వెనక్కి మళ్లారని ప్రశ్నించారు.