Share News

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:46 PM

నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా..

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..
Rahul and Priyanka

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వయనాడ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా కనిపించారు. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అలాగే రాహుల్, ప్రియాంక తన ర్యాలీ దృశ్యాలను స్వయంగా ఫోన్‌లో చిత్రీకరించారు. ర్యాలీకి ముందు పార్టీ నాయకుల సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ర్యాలీ తర్వాత పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రియాంక గాంధీ ప్రసంగించారు. వయనాడ్ ప్రజలకు సేవ చేసేందుకు తాను ఇక్కడి నుంచి పోటీచేస్తున్నట్లు తెలిపారు.

Priyanka and Rahul Gandhi.jpg

CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..


తొలిసారి..

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రమే నిర్వహించారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలీ స్థానాల నుంచి పోటీచేయగా.. రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్13న ఇక్కడ పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక కలిసి పార్లమెంటులో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది.

Chandrababu : ఏపీని ఆపలేరు!


ప్రియాంకకు పోటీగా..

వయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీచేస్తుండగా.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నుంచి సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్‌ పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ తన రాజకీయ అనుభవం ఆధారంగా ప్రియాంక గాంధీకి సవాలు విసిరారు. సింగపూర్, నెదర్లాండ్స్‌లో పనిచేసిన నవ్య కోజికోడ్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు.

నేవీ చేతికి మరో అణ్వాస్త్రం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 12:46 PM