Share News

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:53 AM

కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్‌ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీఎస్టీ లోపాలు చెబితే అవమానిస్తారా: స్టాలిన్‌

చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్‌ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ఉదయం చెన్నై చేరిన స్టాలిన్‌.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ అమలు కఠినంగా ఉందని, ఆ పన్నుల విధానాన్ని సులభతరం చేయాలని కోరిన కోయంబత్తూరు అన్నపూర్ణా హోటల్‌ అధినేత శ్రీనివాసన్‌ను పిలిపించుకుని బలవంతంగా క్షమాపణలు చెప్పించుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

Updated Date - Sep 15 , 2024 | 03:53 AM