Share News

Viral Video: ఫుల్‌గా మందు కొట్టి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి.. వేకువజాము పోలీసులు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 09 , 2024 | 12:29 PM

సోషల్ మీడియాలో మందుబాబులకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఫుల్‌గా మందు తాగి వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆపడం, బస్సు, రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటారు. కొందరైతే ఏకంగా రోడ్డుపై మురుగు నీటిలో పడుకుని, ఆ నీటినే తాగడం కూడా చూశాం. ఇలాంటి ..

Viral Video: ఫుల్‌గా మందు కొట్టి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి.. వేకువజాము పోలీసులు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో మందుబాబులకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఫుల్‌గా మందు తాగి వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆపడం, బస్సు, రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటారు. కొందరైతే ఏకంగా రోడ్డుపై మురుగు నీటిలో పడుకుని, ఆ నీటినే తాగడం కూడా చూశాం. ఇలాంటి వీడియోలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఓ మందుబాబు నిర్వాకానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి రైలు పట్టాలపై పడుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వేకువజాము వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిజ్నోర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి బుధవారం రాత్రి బిజ్నోర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్స్ సమీపంలోకి వెళ్లాడు. అయితే అప్పటికే మద్యం మత్తు ఎక్కువ కావడంతో (drunken man lying on the railway tracks) రైలు పట్టాలపై పడుకున్నాడు. వేకవజాము అటుగా వెళ్లిన వారు.. పట్టాలపై వ్యక్తి పడిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.

Viral Video: ఇదెక్కడి ప్రాంక్‌రా బాబోయ్.. చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం..


వేకువజాము సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పడిపోయిన వ్యక్తి వద్దకు వెళ్లారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలిచంచే క్రమంలో ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. దీంతో పోలీసులతో పాటూ అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. చివరకు విచారించగా అసలు విషయం తెలిసింది. ఆ వ్యక్తిని నేపాల్‌‌కు చెందిన అమర్ బహదూర్‌గా గుర్తించారు. బహదూర్ పట్టాలపై పడిపోయిన కాసేపటి తర్వాత ముస్సోరీ ఎక్స్‌ప్రెస్ అతడి మీదుగా వెళ్లిందని తెలిసింది. అయితే ఆ సమయంలో అతను పట్టాల మధ్యలో కదలకుండా పడుకోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..


బహదూర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడికి ఎలాంటి ప్రాణహానీ లేదని తెలపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, బహదూర్ రైల్వే ట్రాక్స్ పైనుంచి లేచి వచ్చే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు. ‘‘మందుబాబా.. మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాగుడుకు బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Aug 09 , 2024 | 12:29 PM