Share News

Weather Alert: నేడు విద్యాసంస్థలకు సెలవు

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:38 AM

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది.

Weather Alert: నేడు విద్యాసంస్థలకు సెలవు

  • జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలో పలు పరీక్షల వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విద్యా శాఖ ఆదివారమే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.


చాలా చోట్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.

Updated Date - Sep 02 , 2024 | 03:38 AM