Share News

CS Shanti Kumari: స్వాతంత్య్ర వేడుకల్లో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:33 AM

పంద్రాగస్టు వేడుకల్లో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలుంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

CS Shanti Kumari: స్వాతంత్య్ర వేడుకల్లో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలు

  • గోల్కొండ కోటను సందర్శించిన సీఎస్‌

నార్సింగ్‌, హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు వేడుకల్లో వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలుంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించనున్న గోల్కొండ కోటను ఆమె సోమవారం సందర్శించారు. వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.


తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయన్నారు. పిల్లల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిల్చేందుకు వేడుకలకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్‌ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆమె ఆదేశించారు.

Updated Date - Aug 13 , 2024 | 04:33 AM