Share News

Mannem Krishank: తమ్ముళ్ల వ్యాపారం కోసమే రేవంత్‌ అమెరికా పర్యటన

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:03 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటకు వెళ్లింది ఆయన తమ్ముళ్ల వ్యాపారం కోసమేనని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు.

Mannem Krishank: తమ్ముళ్ల వ్యాపారం కోసమే రేవంత్‌ అమెరికా పర్యటన

  • స్వచ్ఛ బయో సంస్థ రేవంత్‌రెడ్డి తమ్ముడిదే

  • బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ఆరోపణ

హైదరాబాద్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటకు వెళ్లింది ఆయన తమ్ముళ్ల వ్యాపారం కోసమేనని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు. ఈమేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో పెట్టుబడి పెడతామంటున్న స్వచ్ఛ బయో కంపెనీ సీఎం తమ్ముడిదేనన్నారు.


రేవంత్‌ తన తమ్ముళ్లను సెటిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 15 రోజుల కిందట పెట్టిన కంపెనీ నుంచి రూ. వెయ్యికోట్ల పెట్టుబడులు తెస్తున్నట్లు చూపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఫ్రాడ్‌ పనులు మానుకొని రాష్ట్ర ప్రగతికోసం పాటుపడాలని క్రిశాంక్‌ సూచించారు.

Updated Date - Aug 08 , 2024 | 04:03 AM