Share News

DSE Exams: షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు!

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:19 AM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు.

DSE Exams: షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు!

  • ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహణ

  • 11 నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్ల జారీ

  • గ్రూప్‌-2 వాయిదా పడే అవకాశం

  • 18 నుంచి డీఎస్సీ పరీక్షలు!

  • 11 నుంచి హాల్‌టికెట్ల జారీ

  • గ్రూపు-2 పరీక్షలు వాయిదా పడే అవకాశం

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి 11వ తేదీ నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌- 2 పరీక్షలు జరగనున్నాయి.


అయితే డీఎస్సీ పరీక్షలు, గ్రూపు-2 పరీక్షలు వెంట వెంటనే ఉండడంతో రెండింటిలో ఒక దానికి సంబంధించిన పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దాంతో గ్రూపు-2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 04:19 AM