Share News

Waqf Act: జేపీసీలో నలుగురు తెలుగు ఎంపీలు

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:51 AM

వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు.

Waqf Act: జేపీసీలో నలుగురు తెలుగు ఎంపీలు

  • తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్‌ ఒవైసీ

  • ఏపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు పరిశీలనకు కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ఎంపీలు ఉన్నారు. 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ(బీజేపీ), హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం), ఏపీ నుంచి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు(టీడీపీ), రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(వైసీపీ) సభ్యులుగా ఉన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 04:51 AM