Share News

Gudem Mahipal Reddy: హస్తం గూటికి ‘గూడెం’ రెడీ?

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:31 AM

కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Gudem Mahipal Reddy: హస్తం గూటికి ‘గూడెం’ రెడీ?

  • నేడో రేపో సీఎం సమక్షంలో చేరిక!

  • ఆదివారం రాత్రి వరకు ముఖ్య అనుచరులతో సమాలోచనలు

  • పార్టీ మార్పుపై.. కార్పొరేటర్ల మౌనం

  • ఇద్దరు మునిసిపల్‌ చైర్మన్లు బీఆర్‌ఎ్‌సలోనే?

పటాన్‌చెరు, జూలై 14: కొంతకాలంగా పార్టీ మార్పుపై ఊగిసలాడుతున్న పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రెండు రోజులుగా ఆయన కాంగ్రె్‌సలోకి వెళతారన్న ఊహాగానాలకు తెరదించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కుమారుడు సీఎం రేవంత్‌, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, జాగ్గారెడ్డి ఫొటోలతో తన వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టడం గమనార్హం..! ఈ క్రమంలో మహిపాల్‌రెడ్డి ఆదివారం రాత్రి వరకు తన నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమాలోచనలు చేశారు. పార్టీ మార్పుపై ఒక్కొక్కరిగా అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే.. ముఖ్య నాయకులు మహిపాల్‌రెడ్డి వెంటే ఉంటామని హామీ ఇవ్వగా.. ముగ్గురు కార్పొరేటర్లు మాత్రం మౌనం వహించారని, ఇద్దరు మునిసిపల్‌ చైర్మన్‌లు(బొల్లారం, తెల్లాపూర్‌) బీఆర్‌ఎ్‌సతోనే ఉంటామని స్పష్టం చేశారని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భవిష్యత్‌లో పటాన్‌చెరు రెండుగా విడిపోతే.. బీఆర్‌ఎ్‌సలో ఉండడం ద్వారా ఎమ్మెల్యే టికెట్‌ దక్కవచ్చని పలువురు నాయకులు భావిస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 07:10 AM