Share News

Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

ABN , Publish Date - May 09 , 2024 | 10:18 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత ఏక్‌నాథ్‌ షిండే పిలుపు మేరకు హైదరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్ధి మాధవీలత(Madhavilatha)కు సంపూర్ణ మద్దతు శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించింది.

Hyderabad: మాధవీలతకు శివసేన మద్దతు..

హైదరాబాద్‌ సిటీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత ఏక్‌నాథ్‌ షిండే పిలుపు మేరకు హైదరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్ధి మాధవీలత(Madhavilatha)కు సంపూర్ణ మద్దతు శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించింది. శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ అభ్యర్థి మాధవీలతని కలిసి తమ మద్దతును తెలిపారు.

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైసి బ్రదర్స్‌కు ఓటమి భయం పట్టుకున్నది.. పాతబస్తీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఈసారి కాషాయ జెండా భాగ్యనగరంలో విజయం సాధిస్తుందన్నారు. మాధవీలతని కలిసిన వారిలో.. శివసేన పార్టీ హైదరాబాద్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ సూర్యవంశీ రమేష్‌, యువసేన రాష్ట్ర నాయకులు విష్ణు, మారుతి, ముని, రాహుల్‌, రాజు, అఖిల్‌, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 10:18 AM