Share News

Hyderabad: రేపు హైదరాబాద్‏కు కేంద్రమంత్రుల రాక...

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:34 AM

కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నగరానికి వస్తున్న జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌(G. Kishan Reddy, Bandi Sanjay)లకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు తెలిపారు.

Hyderabad: రేపు హైదరాబాద్‏కు కేంద్రమంత్రుల రాక...

- బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ

- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానం

హైదరాబాద్‏: కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నగరానికి వస్తున్న జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌(G. Kishan Reddy, Bandi Sanjay)లకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు తెలిపారు. సోమవారం బర్కత్‌పురాలోని నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కలిసి ఈనెల 19న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet Airport)కు చేరుకుంటారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం


అక్కడి నుంచి భారీ ర్యాలీగా ప్రారంభమై ప్యారడైజ్‌ చౌరస్తా, ఎంజీ రోడ్‌, మ్యారియెట్‌ హోటల్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ ఫ్లైఓవర్‌ కిందినుంచి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, హైదర్‌గూడ, బషీర్‌బాగ్‌(Old MLA Quarters, Hyderguda, Bashirbagh), నిజాంకళాశాల అబిడ్స్‌ మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 8.30 గంటల వరకు ఈ సన్మాన కార్యక్రమం పూర్తవుతుందని ఆయన తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 08:36 AM